శ్రీ వరి సాగు పద్దతులతో కనుక పంటను పండించినట్లయితే తక్కువ నీటిని వినియోగించుకోని ఎక్కువ పంట రాబడిని పొందవచ్చునని రైతులతొ వివరించి చెప్పడం జరిగింది.ఈ చర్చల ఫలితంగా గ్రామంలో వున్నటువంటి మాధవ రెడ్డి అనే రైతు శ్రీ వరి సాగు పద్దతిలో సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలను పండించటం జరిగింది.మేము తను అవలంభించిన పద్దతిని మిగిలిన రైతులకు వివరించి చెప్పమని అడగటం జరిగింది.ప్రక్క గ్రామల నుంచి కూడ ప్రజలు శ్రీ వరి సాగు పద్దతి గురించి క్షుణంగా తెలుసుకొని అవలంభించడానికి మాధవ రెడ్డి గారి దగ్గరకు రావడం జరిగింది,కాని చిట్లంకుంట లో నివసించే రైతులు మాత్రం శ్రీ వరి సాగు పద్దతిలో మాత్రం పంటలను పండించటానికి సుముఖంగా లేరు.ఈ పద్దతిని రైతులందరు అవలంభించడానికి ఎక్కడెక్కడయితే శ్రీ వరి సాగు పద్దతులు పంటను పండింస్తున్నారో వారందరితో చిట్లంకుంట రైతులను తీసుకొని వెళ్ళి శ్రీ వరి సాగు పద్దతి గురించి చర్చించవలెను.
సుగంధ మూలికలు మరియు వైద్యానికి సంబంధించిన వనములను కొని వాటిని అభివృధి చేయవలెను అనేది మా ప్రణాళికలో ఒక భాగం.
గ్రామంలో వున్నటు వంటి పశు గ్రాసంను అభివృద్ది పరచుకోవటానికి అవలంభించాల్సిన పద్దతులను స్వయం సహాయక భృందాలకు వివరించి చెప్పటం.
(గ్రామ సహాయకులు) చిట్లంకుంట లో వున్నటువంటి గ్రామ సహాయకులు వారంతట వారే తమ గ్రామములో నివసించుచున్న ప్రజల జీవిత విధానాలను చిన్న చిన్న కథలుగా చేసి ఒక సంపుటిగా తయారు చేసినారు.