సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
  పశువుల రక్షణకు 'రివాల్వింగ్ ఫండ్' ఎర్పాటు.  
గ్రామంలో మేము కుటుంబ వివరాలు సేకరిస్తున్న సమయంలో - ఊరిలో పశుసంపద బాగా ఉందని, అయితే, వ్యాధి నిరోధక టీకాలు వేయించకపోవడం వల్ల పశువులు ఎక్కువగా మరణిస్తున్నాయని తెలిసింది. దీనిపై ప్రజలు మాట్టాడుతూ, తాము ఎక్కువగా పశుసంరక్షణ మరియు వ్యాధి నిరోధక విభాగంపైనే ఆధారపడతామని, స్వయంగా టీకాలు వేయించుకునే ఆర్ధిక స్ధోమత తమకు లేదని అన్నారు. దీనిపై మేము గ్రామ 'గోపాలమిత్ర' శ్రీ రామలింగం గారి సహాయంతో గ్రామంలో పశువులకు వచ్చే వ్యాధులు, కాలానుగుణంగా వచ్చే రోగాలు, వాటి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సవివరమైన అధ్యయనం నిర్వహించాం. పశువుల మందుల విషయం చర్చించడానికి డిపార్ట్ మెంట్ కార్యాలయానికి కూడా వెళ్ళాం. కాని, టీకాల మందు కొరత తీవ్రంగా వుందని, సరఫరా అవుతున్న మందులు మండలంలోని పశువులకు చాలడం లేదని అధికారులు తెలిపారు.
 
దీనితో, వ్యాధి నిరోధక టీకాల ధరల గురించి రామలింగం గారితో చర్చించగా మందుల కొనుగోలు మాకు సాధ్యమేనని అర్ధమైంది. వెంటనే హైదరాబాద్ లోని సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించి వివిధ పశువులకు వివిధ కాలాల్లో వచ్చే వ్యాధులు, వాటికి గల కారణాలు, ముందు జాగ్రత్త చర్యగా వాడవలసిన వ్యాధి నిరోధక టీకాల గురించి ప్రజలను చైతన్యపరిచే చార్టులు, చిత్రాలను సేకరించాము. వీటిని గ్రూపు సమావేశాలలో ప్రదర్శించి చేపట్టవలసిన చర్యల గురించి అవసరమైన డబ్బు గురించి రైతులకు వివరించాము. తక్షణమే ఒక 'ఖాతా'ను ప్రారంభించాము. మొట్టమొదట కొంత మొత్తంతో మూడు సెట్ల టీకాల మందులను తెప్పించాము. తర్వాత ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే వుంది. ప్రజలు ఇప్పుడు వ్యాధి నిరోధక టీకాల మందులకు అయ్యే ఖర్చును భరించడానికి సిధ్ధంగా వున్నట్లు కనిపిస్తున్నది.
 
Click here for Telugu Click here for English Click here for French